చెన్నైకి శివారు ప్రాంతంలో ఉన్న మైలాపూర్ లో కాపాలీశ్వర్ ఆలయం ఉంది. శివపార్వతులకి ఈ ఆలయం అంకితమివ్వబడినది. ఈ ఆలయంలో 'కర్పగంబాల్' లేదా 'కోరికలను తీర్చే దేవత' రూపం లో పార్వతీ దేవిని కొలుస్తారు.
'కపాలం' అంటే తల, శివుని మరో పేరు అయిన 'ఈశ్వర్' రెండు పదాల నుండి ఈ ఆలయం పేరు ని గమనించవచ్చు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు అలాగే శివుడు కైలాస పర్వతం వద్ద కలసుకున్నప్పుడు శివుని గొప్పదనాన్ని బ్రహ్మ గుర్తించలేదన్న కోపం తో బ్రహ్మ యొక్క నాలుగు తల ల లో ఒక తలని బలం గా లాగివేస్తాడు. ఆ తప్పుని సరిదిద్దుకునేందుకు బ్రహ్మ దేవుడు మైలాపూర్ కి వచ్చి ఒక శివ లింగాన్ని స్థాపిస్తాడు.
పల్లవ రాజులచే 7 వ శతాబ్దం లో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని నమ్ముతారు. ద్రావిడ నిర్మాణ శైలి లో ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. ప్రస్తుతం సాంతోం చర్చ్ ఉన్న ప్రాంతం లో అసలైన ఆలయం ఉండేదని అంటారు. పోర్టుగీసు చేత ఆ ఆలయం ద్వంసం చేయబడిన తరువాత 16 వ శతాబ్దం లో విజయనగర రాజులూ ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారు.
రామకృష్ణ టెంపుల్, కాళికాంబాల్ టెంపుల్, సాంతోం చర్చ్ మరియు కపాలీశ్వర్ టెంపుల్ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు చెన్నై ప్రసిద్ది చెందినది. చోలమండల్ ఆర్టిస్ట్స్ విలేజ్ అనబడే విశిష్ట అంశానికి ఈ ప్రాంతం పేరొందింది.
ఎండాకాలం లో వాతావరణం తీవ్రంగా వేడి కలిగి ఉంటుంది. చలికాలం లో చలి అంత తీవ్రతరం కాదు. చెన్నైకి వాయు, రోడ్డు అలాగే రైలు మార్గాల ద్వారా సులభం గా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications