కలవర దుర్గగా పేరొందిన స్కందగిరి టిప్పు సుల్తాన్ పాలన నాటి ఒక కోట. ఈ పురాతన నిర్మాణం సుమారు 1350 అడుగుల ఎత్తులో నంది హిల్ శ్రేణులపై కలదు. స్కందగిరినుండి పర్యాటకులు టిప్పు సుల్తాన్ కోట అవశేషాలు చూడవచ్చు. ఈ కోటను స్ధానిక రాజు టిప్పు సుల్తాన్ నుండి రక్షించుకోడానికి కట్టాడని చెపుతారు.
స్కందగిరి లో రెండు గుహలు కలవు. కోటతో పాటు వీటిని కూడా చూడాలి. ఈ గుహలు ఇంకా పరిశోధించబడుతున్నాయి. అయితే స్ధానికులు ఈ గుహలలో ఒకటి కోటకు వెళుతుందని చెపుతారు. గుహలో 6 సమాధులున్నాయని కూడా చెపుతారు. గుహలలో కొలండ చిలువలున్నాయని, గుహలోకి వెల్ళిన మేకలను అవి తినేస్తాయని కూడా చెపుతారు.