చోప్త సముద్ర మట్టానికి 2680 మీటర్ల ఎత్తులో ఉన్న ఉత్తరాఖండ్ లో రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. ఈ ప్రదేశం అనేది ఉత్కంఠభరితమైనది మరియు అత్యద్భుతమైన అందాన్ని కలిగి ఉండుట వల్ల బుగ్యల్స్ అని పిలుస్తారు,మరియు పచ్చని గడ్డి భూములు ఉండుటవల్ల 'మినీ స్విట్జర్లాండ్' అనే మారుపేరుతో పిలుస్తారు. పర్యాటకులు ఈ ప్రదేశం నుండి చుఖంబ,త్రిశూల్,మరియు నందా దేవి వంటి పర్వత శ్రేణుల అద్భుతమైన వీక్షణలు పొందుతారు.
ఈ ప్రదేశం హిందూ మత దేవుడైన శివకి అంకితం చేయబడిన తుంగ్నాథ్ అనే ఆలయం పేరుగాంచింది.ఈ పురాతన ఆలయం సముద్ర మట్టానికి 3680 మీటర్ల ఎత్తులో,తుంగ్నాథ్ పర్వత శ్రేణి లో ఉంది,మరియు ప్రపంచంలో ఎత్తైన శివాలయంగా పేరు గాంచింది. హిందూ మత పురాణ ప్రకారం, హిందూ మతం పురాణ రామాయణ విరోధి అయిన రావణుడు,ఈ ప్రదేశంలో తన పాపాలకు పశ్చాత్తాపపడెను. తుంగ్నాథ్ ఆలయంను చోప్త నుండి 3.5 కి.మీ. ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు.
మందాకిని నది దగ్గరగా ఉన్న కేదార్నాథ్ మందిర్ అనే మరొక ప్రసిద్ధ మత ఆకర్షణ. ఈ ఆలయం పంచ్ కేదార్ లో ఒకటి మరియు హిందువులకు ఒక ముఖ్యమైన మత కేంద్రంగా ఒకటి.అలాగే ఈ ఆలయంలో ఉన్న శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అదనంగా, ఈ ఆలయంలో శివుని చుట్టూ 200 విగ్రహాలను ఉన్నాయి. మధ్యమహేశ్వర్ ఆలయం,కల్పేశ్వర్ మందిర్, మరియు కంచుల కోరాక్ కస్తూరి జింక అభయారణ్యం ఈ ప్రదేశంలో చూడవలసిన ఇతర ప్రముఖ పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.
చోప్తలో ఉత్తమ వృక్షజాలం మరియు జంతుజాలం ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ప్రకృతి ప్రేమికులైన పర్యాటకులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా,ఈ ప్రదేశం పంచ్ కేదర్ పర్వతారోహణకు ఒక బేస్ కాంప్ గా పనిచేస్తుంది. చోప్తను చేరటానికి విమాన,రైల్,రోడ్డు మార్గాలు ఉన్నాయి. డెహ్రాడూన్ లో జాలీ గ్రాంట్ విమానాశ్రయం గమ్యానికి సమీప ఎయిర్ బేస్ గా పనిచేస్తుంది. ఇది కొండ ప్రాంతం నుండి 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం సాధారణ విమానాలు ద్వారా న్యూ ఢిల్లీ లో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనుసంధానించబడింది. చోప్త సమీపంలోని రైల్వే స్టేషన్ రుషికేష్ లో ఉంది. యాత్రికుల హరిద్వార్, డెహ్రాడూన్,రుషికేష్ నుండి బస్సు సేవలు పొందుతారు.
వర్షాకాలం మరియు వేసవికాలాలు ఈ అందమైన పర్వత పర్యటనకు ప్రణాళికా రచన కోసం ఉత్తమమైనవిగా భావిస్తారు. యాత్రికుల చోప్త లో భారీ హిమపాతం ఉన్న శీతాకాలంలో ఈ ప్రదేశం సందర్శినకు అనుకూలం కాదు.