రాజర గద్దిగె అని ఈ ప్రదేశాన్ని పిలుస్తారు. కూర్గ్ ప్రధాన ఆకర్షణలలో ఇది కూడా ఒకటి. గతంలో కొడకు రాజులు దొడ్డ వీర రాజేంద్ర, లింగ రాజేంద్ర మరియు రాజాగురు రుద్రప్ప మొదలైన వారు ఈ ప్రాంతాన్ని వేసవి విడిదిగా ఉపయోగించేవారు. గద్దిగె లో రెండు ఒకే రకమైన నిర్మాణాలుంటాయి.
ఇవి రాజు దొడ్డ వీర రాజేంద్ర మరియు అతని రాణి ల సమాధులు. అవి రెండు ఒకదానికొకటి సమీపంలోనే ఉంటాయి. వీటిని ఇండో సార్కానిక్ శైలిలో నిర్మించారు. మధ్యలో కూడా నాలుగు మూలలలోను కల నాలుగు స్తంభాల ఆధారంగా కేంద్ర గోపురాలు కలవు. కుడి గోపురం రాజు లింగరాజేంద్ర కి చెందినది కాగా దీనిని అతని కుమారుడు రాజు చిక్క వీర రాజేంద్ర క్రీ.శ.1820 సంవత్సరంలో నిర్మించారు. ఎడమ గోపురం రాజ పురోహితుడు రుద్రప్పది. దీనిని క్రీ.శ. 1834 లో నిర్మించారు.
సమీపంలోనే టిప్పు సుల్తాన్ తో యుద్ధం చేసి మరణించిన బిడ్డండ బోపు మరియు అతని కుమారుడు బిద్దండ సోమయ్యలనే అధికార్ల సమాధులు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశం మడికెరి నుండి 1 కి.మీ. దూరం ఉంటుంది.