దండేలి పర్యాటకులు కాళీ నది కూడా తప్పక చూడాలి. దీనినే కాళింది నది అని కూడా అంటారు. ఈ నది డిగ్గి అనే చిన్న గ్రామం నుండి మొదలవుతుంది. ఇక్కడ సుమారు 4 లక్షలమంది నివాసితులుంటారు. కాళీ నది పై అనేక డ్యామ్ లు కూడా కట్టారు. వీటినుండి విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తారు. గణేష్ గుడిలోని సూపా డ్యామ్ ఈ నదిపై గల ప్రధాన డాములలో ఒకటి. పర్యాటకులు బోటింగ్, నావ ప్రయాణం వంటివి చేయవచ్చు. వివిధ రకాల పక్షులు కనపడతాయి. వాటిలో చెకుముకి పిట్టలు, మైనాలు, కోకిలలు చిలుకలు, ఎన్నో ఉంటాయి. 184 కి.మీ. పొడవుకల కాళి నది చూసే పర్యాటకులు నది పైగల వంతెన నుండి సదాశివ ఘడ్ ఫోర్ట్ తప్పక చూడాలి. ఈ కోటను, నది మరియు అరేబియా సముద్రం రెండూ కలిసే చోట కట్టారు. నది వంతెనపై గోవా కర్నాటకలను కలిపే జాతీయ రహాదారి 17 కలుస్తుంది. టూరిస్టులు అక్టోబర్ నుండి మార్చి నెలలలో నదిని సందర్శించి ఆనందించవచ్చు. ర్యాఫ్టింగ్ చేయవచ్చు.