మహావీర్, నేమినాథ్, సంభవ్ నాథ్, శాంతినాథ్ మరియు పర్ష్వ నాథ్ అనే ఐదుగురు జైన తీర్థంకరులకు అంకితం చేస్తూ 12 వ శతాబ్దంలో విమల్ షా నిర్మించిన ఐదు దేవాలయాలను కుంభారియా జైన్ ఆలయాలు అంటారు. చాళుక్య రాజు భీమదేవ్ I మంత్రి విమల్ షా నిర్మించిన 360 జైన్ ఆలయాలకు గానూ కేవలం ఈ ఐదు ఆలయాలు మాత్రమే మిగిలాయి.
ఇవి పాలరాతితో కళాత్మకంగా నిర్మించబడ్డాయి. ఈ ఆలయాలు తరంగ కొండల నుండి 40 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. దేవుళ్ళు, దేవతలు, దేవదూతలు, గుర్రపు రౌతులు మరియు సంగీతకారుల విస్తృతమైన కళాత్మక చెక్కడాలు ఇక్కడ చూడవచ్చు. దేవాలయాలు రొజూ ఉదయం 6.30 మరియు సాయంత్రం 7.30 మధ్య తెరిచి ఉంటాయి.



Click it and Unblock the Notifications