దేవరాయనదుర్గని సందర్శించేటప్పుడు, ప్రయాణీకులు కొండపై ఉన్న యోగ నరసింహస్వామి దేవాలయాన్ని తప్పక సందర్శి౦చాలి. బ్రహ్మ దేవుడు (విశ్వ సృష్టికర్త) ఈ యత్రాస్థలాన్ని నిర్మించినట్టు జానపదుల కధనం. బ్రహ్మదేవుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే శివుడు సంతోషించి శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన యోగ నరసింహ స్వామీ రూపంలో ఈ ప్రదేశంలో ప్రత్యక్షమయ్యారు.
ఈ ప్రదేశానికి చేరిన తరువాత, పర్యాటకులు యోగా నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో కళ్యాణ తీర్థమ్ అనే ఒక పవిత్రమైన చెరువుని చూడవచ్చు. ఇక్కడి ప్రధాన దైవం విగ్రహంలోంచి ఒక పవిత్రమైన తీర్థం ప్రవహిస్తుందని స్థానికులు నమ్ముతారు. దుర్గదహళ్లి గ్రామంలో వున్న 700 ఏళ్ళ నాటి విద్యాశంకర స్వామీ దేవాలయాన్ని చూడడానికి నిర్మించిన ప్రత్యెక ప్రదేశాన్ని కూడా యాత్రికులు చూడవచ్చు.



Click it and Unblock the Notifications