బిర్స ముండ పార్క్, ధన్బాద్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. అన్ని వయసులవారూ దీనిని సందర్శించవచ్చు. ఇది నవంబర్ 2009 లో ప్రారంభమైంది, దీనికి తగినంత ఆదరణ లభించింది. పిల్లలు ఆనందించడానికి వివిధ రైడ్లు, బొమ్మల రైళ్లతో ఈ క్రీడా ప్రదేశం ఉంటే, ఈ పార్క్ లో పెద్దవారికి నడిచే మార్గాలు ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి. ఈ పార్క్ 21 ఎకరాలకు పైన విస్తరించి ఉంది. తగిన౦త గస్త్రోనోమిక్ అవసరాలకు కాంటీన్ కూడా అందుబాటులో ఉంది. ఈ పార్క్ మొత్తం వివిధ జాతుల మొక్కలతో అలంకరించబడి ఉంది. పూర్తి ప్రక్రియ ఇంకా ఉన్నప్పటికీ, ఈ పార్క్ నుండి 12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉత్పత్తి చేయబడింది.
ధన్బాద్ లో ఉన్న ఈ మొదటి పార్క్, ప్రారంభంలో నిర్మాణానికి నిధులు లేక బంజరు భూమిలా ఉంది. దీనిని ఒక ఆకర్షణీయ పర్యాటక ప్రదేశంగా మార్చడానికి MGNREGA బాధ్యత తీసుకుంది. అందమైన ఆకృతి, పచ్చదనంతో విస్తరించి ఉన్న ఈ బిర్స ముండ పార్క్ గనుల రాజధానిలో తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ఈ పార్క్ వినోదాన్నే కాకుండా, నగరంలోని అనేకమందికి ఉపాధిని కూడా కల్పిస్తుంది. ఈ పార్క్ నగరంలోని వివిధ ప్రాంతాలలో రాబోయే మూడు ప్రధాన ప్రాజెక్ట్ లకు సోపానం వంటిది.



Click it and Unblock the Notifications