కాళి నది 'కాలాపానీ' వొద్ద హిమాలయాల నుండి ఉద్భవించినది. పిథొరగర్హ్ జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3600 మీ. ఎగువన ఉన్నది. ఇక్కడ కాళి దేవాలయం కూడా ఉన్నది. ఈ నది ఇండియా మరియు నేపాల్ మధ్య సహజంగా ఏర్పడిన విభజన రేఖలాగా ఉన్నది. ఇది ఇండియాలో ఉత్తరాఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్ గుండా ప్రవహిస్తున్నది( ఇక్కడ ఈ నది పేరు 'శారద' గా మారింది). జుల్జిబి వద్ద 'గోరి గంగ' లో కలిసి, చివరిగా పవిత్రమైన 'గంగ' నదితో కలుస్తుంది. కాళి నదిలో వివిధ ట్రాక్స్ లో 'రాఫ్టింగ్' చేస్తూ, పర్యాటకులు చాలా ఆనందిస్తుంటారు.