ధార్చుల ఉత్తరాఖండ్ లో పిథొరగర్హ్ జిల్లాలో ఇండో-నేపాల్ బార్డర్ మీద ఉన్న ఒక అందమైన పట్టణం. ఈ ప్రదేశం యొక్క పేరు రెండు మాటలు 'ధార్' మరియు 'చుల', నుండి ఏర్పడింది. 'దార్' అంటే శిఖరం మరియు 'చుల' అంటే స్టవ్ అని హిందీలో అంటారు. ఈ హిల్ పట్టణం స్టవ్ ఆకారంలో ఉండటం వలన దీనికి ఈ పేరు వొచ్చింది. ఇది పిథొరగర్హ్ పట్టణానికి 90 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ పట్టణం చుట్టూరా పర్వతాలు ఉన్నాయి. ధార్చుల పశ్చిమాన ఉన్న.మంచుతో కప్పబడిన పంచ్చులి శిఖరాలు జోహార్ వాలి నుండి ఈ ప్రదేశాన్ని వేరు చేస్తున్నాయి. ఈ పట్టణంలో మానస సరోవర్ మరియు మానస సరస్సు వంటి ప్రముఖ పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.
మానస సరోవర్ చైనా యొక్క టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతంలో ఉన్న ఒక మంచినీటి సరస్సు. ఈ సరస్సు హిందూమతం మరియు బౌద్ధమతం యొక్క గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. ఈ సరస్సులోని నీరు పాపాలను కదిగివేస్తాయని మరియు మోక్షానికి దారి తీస్తాయని నమ్ముతారు. మానస సరోవర్, బుద్ధుడు ఎక్కడ ఉద్భవించాడో, ఒక పౌరాణిక సరస్సు 'అనవతప్త' సరస్సు,తో కలిసి ఉంటుందని బౌద్ధులు భావిస్తున్నారు. ఈ సరస్సు తీరం పైన కొన్ని మఠాలు ఉన్నాయి. వీటిలో చియు గొంప మొనాస్టరీ, ఇది ఒక ఏటవాలు కొండపైన నిర్మించబడింది.
ఈ సరస్సు ప్రముఖ నదులు బ్రహ్మపుత్ర, సింధు మరియు సట్లెజ్ యొక్క మూలం అయి ఉంటుందని భావిస్తున్నారు. మానస సరోవరానికి పడమర వైపున ఉన్న రక్షాతల్ సరస్సును కూడా పర్యాటకులు చూడవొచ్చు. దీని తోడూ, కాలాపానీ వొద్ద గ్రేటర్ హిమాలయాలనుండి ఉద్భవించిన 'కాళీ' నది మీద రాఫ్టింగ్ అనుభూతిని పొందవొచ్చు. నది మీద నిర్మించిన ఆనకట్ట, చిర్కిల డాం ఒక అందమైన సరస్సు అనుసంధించబడి ఉన్నది మరియు ఇది ఒక ప్రముఖ విహార స్థలం అయిఉన్నది. ప్రయాణికులు ధార్చులను సందర్శించటానికి వొచ్చినప్పుడు, సమీపంలో ఉన్న ఓం పర్వత్, ఆది కైలాష్, ఇండియా-నేపాల్ మరియు ఇండియా-సైనో బార్డర్ మరియు నారాయణ్ ఆశ్రమం మొదలైన వాటిని కూడా చూడవొచ్చు.
పర్యాటకులు పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ నుండి కాబ్ను అద్దెకు తీసుకుని ఈ ప్రదేశానికి చేరుకోవొచ్చు. ఈ విమానాశ్రయం, ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, న్యూ ఢిల్లీతో కలుపబడి వుంది. తనక్పూర్ రైల్వే స్టేషన్, దార్చులకు చాలా దగ్గరలో ఉన్నది. పిథొరగర్హ్ నుండి దార్చులకు రాష్ట్ర రవాణా బస్సుల సర్వీసులు ఉన్నాయి. పర్యాటకులు ఈ ప్రదేశాన్ని, శీతాకాలంలో సందర్శించటానికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది.