పవిత్రమైన ద్వారకా నగరం ఆధ్యాత్మిక విశిష్ట ప్రదేశాలతోఅలాగే వాటికి సంబంధించిన ఇతిహాసాలతో ముడిపడి ఉంది. ఈ విశేషాలని తెలుసుకుంటూ అలాగే ఈ నగరం యొక్క అందాలని కూడా ఆస్వాదించడానికి గోమతి నదిలో పర్యాటకులు పడవ ప్రయాణం చెయ్యవచ్చు. ఈ నదీ తీరాన ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన దేవాలయాలలో శివుడు, కృష్ణుడు, రాముడు మరియు శ్రీకృష్ణుడి విశ్వాసపాత్రుడైన స్నేహితుడు సుధాముడు దేవాలయాలు ఉన్నాయి. కొన్ని యుగాలుగా ఈ దేవాలయాలు పుణ్యక్షేత్రాలుగా ప్రఖ్యాతి గాంచాయి.