ఈ ప్రఖ్యాత స్థలం లో ఒక చిన్న కొలను ఉన్నది. ఈ కొలనులో శ్రీ కృష్ణ పరమాత్మ గోపికల తో రాసలీలలు సాగించాడని నమ్ముతారు. ద్వారకకు ఉత్తరాన 20 కిలో మీటర్ల దూరం లో ఈ కొలను ఉన్నది. ఈ తలవ్ చుట్టూ పక్కల ఉన్నటువంటి మట్టి పసుపు పచ్చ రంగులో మెత్తగా ఉంటుంది. దీనిని గోపి చందన్ అని పిలుస్తారు. భక్తులు తిలకంగా ధరిస్తారు. ఈ గోపి తలవ్ కి ముడిపడి ఎన్నో ఆసక్తికరమైన పురాణగాధలు ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకానొక పురాణ కథ ప్రకారం శ్రీ కృష్ణుణితో బృందావనంలో నృత్యం చేసిన గోపికలు శ్రీ కృష్ణుడు ద్వారక కు తరలి వచ్చినప్పుడు ఆ విరహం తాళలేక ఈ తలవ్ వద్దకు పున్నమి రోజు రాత్రి వచ్చి అక్కడే ఆయనతో కలిసి మళ్లీ నృత్యం చేసారు.