అచ్చాబాల్,తోట ను మొగల చక్రవర్తి జహంగీర్ భార్య నూర్ జహాన్ కట్టించింది. దీనిని 1620 సంవత్సరం లో నిర్మించారు. ఇక్కడ ఒక సెలయేరు కలదు. సెలయేరు నీరు తోటలోకి వచ్చే ళా ఏర్పాటు చేసారు. చినార్ చెట్లు, సెలయేళ్ళు, పచ్చని మైదానాలు తో ప్రదేశం ఇంతి అందంగా వుంటుంది. తర్వాతి కాలం లో మొగల ప్రిన్సు దారా శికొహ్, ఈ తోటలో ఒక మసీదు నిర్మించాడు.
అచ్చాబాల్ అనంతనాగ్ కు 8 కి. మీ.లు, శ్రీ నగర్ కు 56 కి. మీ.ల దూరం లో వుంటుంది. ఇక్కడ సమీపం లోని విశ్రాంతి భవనాల లో వసతి దొరుకుతుంది. ఇక్కడ ఫిషింగ్ , కామ్పింగ్ వంటివి చేయవచ్చు.



Click it and Unblock the Notifications