మహానవమి దిబ్బ నలుచదరపు నిర్మాణం. హంపిలో మరో ప్రధాన ఆకర్షణ. దీనిని చక్రవర్తి క్రిష్ణదేవరాయలు తాను ఉదయగిరి (ప్రస్తుత ఒరిస్సా)పై పట్టు సాధించిన తర్వాత నిర్మించారను. హంపి నిర్మాణాలలో ఇది పొడవైన నిర్మాణం. కనుక ఏ ప్రదేశానికి వెళ్ళినా కనపడుతుంది. చారిత్రక ప్రాధాన్యతకల ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాల్సిందే.
ఇక్కడ గుర్రాలు, ఏనుగులు, సైనికుల బొమ్మలను చెక్కారు. దీనిపైకి ఎక్కి చుట్టుపక్కల ప్రదేశాల అందాలను కూడా వీక్షించవచ్చు. చరిత్ర కారుల మేరకు ఈ మహానవమి దిబ్బను రాజులు వారి సైనికుల వినన్యాసాలను చూచి ఆనందించటానికి వినియోగించేవారు. ప్రత్యేకించి నవరాత్రి సందర్భంగా ఈ వేడుకలు జరిగేవి.