విరూపాక్షదేవాలయం లో శివుడు మాత పంపా దేవి ఉంటారు. ఈ దేవాలయం 9 అంతస్తులు కల 50 మీటర్ల ఎత్తు గోపురం కలిగి ఉంది. హేమకూట హిల్ క్రింది భాగంలో తుంగభద్ర నది దక్షిణ ఒడ్డున కలదు. ఈ దేవాలయం దక్షిణ భారత దేశ ద్రవిడ శిల్ఫశైలి కలిగి ఉంటుంది. దీనిని ఇటుకలు, మోర్టార్ లతో నిర్మించారు.
దీనినే పంపాపతి దేవాలయం అని కూడా అంటారు దీనికి గర్భగుడి, ముఖ మంటపం, మూడు వెనుక గదులు, స్తంభాల హాలు కలవు.
విరూపాక్ష దేవాలయం చూసిన తర్వాత పర్యాటకులు అది 7వ శతాబ్దంకు చెందిందని దాని పై చెక్కడాలు 9వ మరియు 11వ శతాబ్దాలనాటివని కనుగొంటారు. మొదట ఈ దేవాలయంలో కొన్ని విగ్రహాలు మాత్రమే ఉండేవి. తర్వాత మరికొన్ని ప్రతిష్టించారు. క్రీ.శ. 1510 లో క్రిష్ణదేవరాయలు రంగ మండపాన్ని నిర్మించారు. దీనిలో స్తంభాలు, గుడి వంటగది, దీపపు స్తంభాలు, టవర్లు మరియు ఇతర పుణ్య క్షేత్రాలు తర్వాత ఏర్పరచారు. విరూపాక్ష దేవాలయ ప్రధాన ఆకర్షణలు, చెక్కిన జంతువుల బొమ్మలు, హిందూ పురాణాలను చూపే పెయింటింగులు.