తుంగభద్ర హిందువుల పవిత్ర నది. దక్షిణ భారతంలో కల ఈ నది కర్నాటక నుండి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రవహిస్తుంది. హంపి నగరం తుంగభధ్ర నది దక్షిణపు తీరంలో కలదు. తుంగ మరియు భద్ర నదులు కలిసి తుంగభద్ర నది ఏర్పడుతుంది. హంపికి నైరుతి దిశగా దీనిపై విద్యుత్ తయారీకి ఒక డ్యామ్ నిర్మించారు.
పురాతన కాలంలో విజయనగర రాజులు ఈ నదిని అనేక సాగునీటి కాల్వలకు ఆక్విడెక్టులకు ఉపయోగించేవారు. వారి భవనాలకు కూడా చక్కటి నీటి సరఫరా విధానాలతో ఈ నీటిని ఉపయోగించారు. ఇప్పటికి పురాతన కాల్వలను ఉపయోగించి వ్యవసాయాలు చేస్తున్నారు. హంపిలో ఇది చూడదగ్గ నది ప్రతి ఏటా దాని తీరానికి వేలాది పర్యాటకులు వస్తారు.
తుంగభద్రనదిని గతంలో పంపా అనేవారు. పంప అంటే బ్రహ్మదేవుని కుమార్తె. ఆమె తపస్సు చేసి శివుడిని మెప్పించి ఆయనను వివాహమాడటంచే దీనికి పంపాపతి అని పేరు వచ్చింది. పంప కధలోనే హంపి పేరు కూడా మూలకమై ఉంది. తుంగభద్రనదిని దర్శించే పర్యాటకులు, అనేక శివ విగ్రహాలను, లింగాలను చూడవచ్చు.