జంబూ ద్వీప్ ఒక ద్వీపం లాంటి టెంపుల్ కాంప్లెక్స్. గౌరవనీయ జైన సాధ్వి పూజ్య అరయక రత్న జ్ఞానమతి మాతాజీ తన ధ్యానం లో భగవాన్ బాహుబలి సమక్షం లో 1965లో వింధ్య పర్వత శ్రేణులలో దీనిని చూసింది. ఆమె చూసిన ఈ ప్రదేశం 2000 సంవత్సరాల నాటి పురాతన జైన గ్రంధాలలో వున్నట్లు కనుగొన్నారు. ఇదే ప్రదేశాన్ని మొదటి జైన తీర్ధంకర కూడా తన కలలో కనుగొన్నారు. జంబూ ద్వీపం అనేది తీర్తంకురులు తమ మత గ్రంధాలలో వివరించిన ప్రపంచ భౌగోలికత.
గ్రందాలలో వివరించిన రీతిలో ఈ ఐలాండ్ ను హస్తినాపూర్ లోని త్రిలోక్ శోధ సంస్థాన్ నిర్మించింది. విశ్వంలో అతి పెద్దదైన సుమేరు పర్వతాన్ని కూడా నిర్మించింది. జమ్బుద్వీప్ లోని సుమేరు పర్వతం 101 అడుగుల ఎత్తు కలదు. దీనిలో చైత్యాలయాలు, నదులు, కొండలు, లవణ సముద్రం వుంటాయి.