పర్యాటకులు హుబ్లీపర్యటనలో రాయపూర్ లోని శ్రీ క్రిష్ణ బలరామ దేవాలయాన్ని తప్పక చూడాలి. ఈ దేవాలయాన్ని ఇస్కాన్ లేదా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్రిష్ణ కాన్షస్ నెస్ నిర్మించింది. దీనిని 12 ఫిబ్రవరి, 2006 లో ఆవిష్కరించారు. ఈ దేవాలయం బెంగుళూరు లోని ఇస్కాన్ దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఈ దేవాలయం ధార్వాడ్ మరియు హుబ్లీ లలోని సుమారు 80,000 మంది పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేస్తుంది.