దోణా పౌలా గోవా రాజధాని పనాజికు గ్రామీణ ప్రాంతం. అనేక పర్యాటకులు సందర్శిస్తారు. సిటి లో భాగమే అయినప్పటికి ఈ ప్రాంతం గ్రామీణ రూపం కలిగి ఉంటుంది. విమానాశ్రయానికి 23 కి.మీ.ల దూరంలో ఉంటుంది. గోవా వెళ్ళినపుడు కనుక దోణా పౌలా లో బస చేస్తే, ఇది సరిగ్గా మధ్య భాగంలో ఉంది కనుక నార్త్ మరియు సౌత్ గోవాలు రెండూ చూసేటందుకు అనుకూలంగా ఉంటుంది.
రెండు భాగాలలోని బీచ్ ల ఆనందాలను అనుభవించవచ్చు. పోర్చుగీస్ పాలనలో అప్పటి వైస్ రాయ్ కుమార్తె దోణా పౌలా డి మెంజిస్ పేరుపై ఈ ప్రాంతం పేరు పెట్టబడింది. ఈమె ఒక మత్స్యకారుడిని ప్రేమించిందని తండ్రి పెళ్ళికి అనుమతి ఇవ్వక పోవటంతో అక్కడే కల ఒక కొండపైనుండి కిందపడి మరణించిందని చెపుతారు. ఇపుడు ఆ కొండను లవర్స్ పేరడైజ్ అని అంటారు. అది పనాజికు 7 కి.మీ.ల దూరంలో కలదు.
దోణా పౌలా బీచ్ లో అనేక నీటి క్రీడలకు అవకాశం కలదు. బీచ్ చుట్టు పట్ల ప్రాంతం షాపింగ్ చేయవచ్చు. అయితే, బేర సారాలు బాగా తెలిసినవారై ఉండాలి. దోణా పౌలా చేరేందుకు అనేక బోర్డులు దారి చూపుతాయి. క్యాబ్ లు, బస్ లు, అద్దె బైక్ లలో తేలికగా చేరవచ్చు.