భట్టీ వంశ రాజులు నిర్మించిన రాజ సమాధులు వున్న పెద్ద పార్క్ గా బడా బాగ్ ప్రసిద్ది చెందింది. మహారావాల్ జైత్ సింగ్ సమాధి అన్నిటికన్నా పురాతనమైనది. ఈ ప్రాంతం జైసల్మేర్ నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో వుంది. సమాధులే కాకుండా, ఈ పార్కు లోపల జైత్ సార్ సరస్సు, జైత్ బాంద్ ఆనకట్ట, గోవర్ధన స్థంభం కూడా యాత్రికులు చూడవచ్చు. ఈ ఆనకట్ట, జలాశయం నిర్మించడానికి ధృడమైన రాతి మొద్దులతో నిర్మించారు. యాత్రికులు జైసల్మేర్ నగరం నుంచి కార్లు, రిక్షాల ద్వారా ఈ ప్రసిద్ధ పర్యాటక కేంద్రానికి చేరుకోవచ్చు.