14 వ శతాబ్దంలో మహార్వాల్ గడ్సీ నిర్మించిన గడ్సిసర్ సరస్సు ఒక కృత్రిమ జలాశయం. ఈ వర్షపునీటి సరస్సు ఆ కాలం లో ప్రధాన జలవనరుగా ఉండేది. ఈ సరస్సు ఒడ్డున చాలా చిన్న చిన్న దేవాలయాలు వున్నాయి. ఈ సరస్సులో వలస పక్షులను యాత్రికులు చూడవచ్చు. ఈ పక్షులు భరతపూర్ పక్షుల కేంద్రం నుంచి వెనక్కి వస్తూ ఇక్కడ కాసేపు ఆగుతాయి.సరస్సుకు దగ్గరలోనే యాత్రీకులు ‘గేట్ ఆఫ్ టిల్లన్’ ను కూడా చూడవచ్చు. ఈ ప్రవేశద్వారం రోడ్డుకు ఆవలి వైపు దాకా వుండి 1908లో ఏర్పాటు చేసిన విష్ణు మూర్తి విగ్రహం తో అలంకరించబడి వుంటుంది.