బావే వాలి మాత టెంపుల్ బాహు ఫోర్ట్ తో పాటు చూడవచ్చు. ఇది బాహు కోట లోపలే ఉంటుంది. కధనం మేరకు ఈ గుడి ని 1822 లో మహారాజ గులాబ్ సింగ్ జమ్మూ , కాశ్మీర్ రాజ్య పాలన చేపట్టిన తర్వాత నిర్మించారు. ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయం జమ్మూ ప్రాంతాన్ని పరి రక్షించే కాళికా మాత కు చెందినది. వైష్ణో దేవి అమ్మవారి టెంపుల్ తర్వాత ఈ గుడి ప్రాధాన్యత కలది. భక్తులు ఈ టెంపుల్ ను ఆదివారాలు, మంగళ వారాలలో అధిక సంఖ్య లో సందర్శిస్తారు.