డోగ్రా ఆర్ట్ మ్యూజియం ముబారక్ మండి కాంప్లెక్స్ లోని ఒక ప్రసిద్ధ మ్యూజియం. ఈ గేలరీ పింక్ హాల్ లో కలదు. సుమారు 800 కు పైగా అరుదైన వస్తువులు, పెయింటింగ్ లు అంటే, కాంగ్రా బశోలి, మరియు జమ్మూ పట్టణాలకు సంబంధించినవి ఇందులో వుంటాయి. దీని ప్రధాన ఆకర్షణ అంటే , విల్లు బాణం మొఘల్ చక్రవర్తి షా జహాన్ వి బంగారు తో చేయబడి వుంటాయి. వడ్రంగి పని , ఈ మ్యూజియం ప్రత్యేకత దీనిలో పర్షియన్ భాషలో వ్రాసిన సికందరమ్మ మరియు శాహనామ వంటి గ్రంధాలు కూడా కలవు.
పహారీ స్కూల్ ఆఫ్ ఆర్ట్ కు చెందిన మీనియేచర్ పెయింటింగ్ లు , వివిధ సేకరణలు కూడా ఈ మ్యూజియం ప్రత్యేకత. భారత దేశ సంస్కృతి తెలిపే అనేక గ్రంధాలు కూడా కలవు. కనుక పర్యాట కులే కాక రీసెర్చ్ చేసే వారు, విద్యార్ధులు, చరిత్రకారులు కూడా దీనిని సందర్శిస్తారు.