భిన్దవాస్ పక్షుల అభయారణ్యం హర్యానా లోని ఝజ్జర్ పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, దేశ రాజధాని ఢిల్లీ నుండి మూడు గంటల ప్రయాణం. ఇది 1074 ఎకరాల భూమిలో విస్తరించి ఉంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల లనుండి 250 కంటే ఎక్కువ జాతులు, షుమారు 35,000 రకాల వలస నీటి పక్షులను కలిగిఉన్న దీనిలోని అద్భుతమైన సరస్సు ఈ అభయారణ్య ప్రాధమిక ఆకర్షణ.
440 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ సరస్సు చుట్టూ మనిషి తయారుచేసిన 12 కిలోమీటర్ల ఆనకట్ట ఉంది, ప్రాధమికంగా ఇది విద్యుత్తు వైఫల్య సమయంలో లిఫ్ట్ వ్యవస్థ పనితీరు ఆగిపోయినప్పుడు, సొరంగం గుండా జవహర్ లాల్ నెహ్రూ కాలువ నుండి బైటికి వెళ్ళే నీటిని ఆపడానికి నిర్మించింది. ఈ అభయారణ్యం రాజస్థాన్ లోని ప్రపంచ ప్రఖ్యాత భరత్పూర్ పక్షుల అభయారణ్యం లో క్షీణించిపోతున్న నీటి స్థాయి దృష్టిలో పర్యావరణ ప్రాముఖ్యత పొందింది.
ఈ అద్భుతమైన సరస్సు కళ్ళకు యదార్ధమైన విందును కల్పిస్తుంది. ఇది పక్షుల గూళ్ళ ప్రాంతంగా సేవలందించడానికి అనేక సూక్ష్మ ద్వీపాలను కలిగిఉంది. ఇది అనూహ్యంగా శక్తివంతమైన కెమెరా లెన్స్ లేకుండా, ఎక్కువ నీరు విస్తరించిన అందాన్ని ‘షూట్’ చేయడం సాధ్యం కాదు.



Click it and Unblock the Notifications