ధర్మశాల నుండి 52 కిలోమీటర్ల దూరం లో ఉన్న బాబా బరొహ్ టెంపుల్ ఈ ప్రాంతం లో ఉన్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ. హిందువుల దైవం అయిన కృష్ణుడు మరియు రాధ లకి ఈ ఆలయం అంకితమిచ్చారు. ప్రతి రోజు ఏంతో మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. బి.ఆర్ శర్మ అనే స్థానిక భక్తుడిచే నిర్మించబడిన ఈ ఆలయం తెల్లని పాలరాతితో నిర్మించబడింది. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న అన్ని ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కువ మొత్తం లో తెల్లని పాల రాతి ని ఉపయోగించారు. లోహం తో తయారు చేసిన దుర్గా దేవి విగ్రహాన్ని ఈ ఆలయం లో ప్రతిష్టించారు. కాళి నాథ్ భోలే శంకర్ కి అంకితమివ్వబడిన ఒక ప్రాచీన మందిరం ఈ బాబా బరొహ్ ఆలయానికి సమీపంలో ఉంది.