కరైకుడి టౌన్ లో గాంధీ స్క్వేర్ ఎట్ మహార్నోబు పోట్టాల్ ఉంది. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినది ఇది. ఈ స్క్వేర్ లో నిలబడి ఎందరో ప్రసిద్ద వ్యక్తులు ఉపన్యాసాలు ఇచ్చారు.
1906 లో ఈ ప్రాంతానికి ప్రసిద్ద వ్యక్తీ విచ్చేశారు. ప్రఖ్యంతి గాంచిన తమిళ కవి, రచయిత, అక్తివిస్ట్ అయిన సుబ్రమణ్య భర్తీ ఈ టౌన్ ని సందర్శించి ఈ ప్రాంత అభివృద్దికి కృషి చేసిన చెట్టియార్ యువతని ప్రశంసిస్తూ ఒక కవితను గానం చేసారు. గాంధీ స్క్వేర్ ఎట్ మహార్నోబు పోట్టాల్ లో నిలబడి అతను ఈ కవితను పాడారు. ఈ సమయం లో అయన ఈ సందర్భం లో దిగిన ఫోటో ని వెలకట్టలేని భారతీయ చారిత్రక సేకరణలో గమనించవచ్చు
జాతిపిత మహాత్మా గాంధీ ఈ ప్రాంతానికి 1927 లో విచ్చేశారు. అయన ఇక్కడ 2 ఉపన్యాసాలు ఇచ్చారు. అతని పేరే ఈ ప్రాంతానికి వచ్చింది. 1948 లో పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారు CECRI కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఇక్కడికి విచ్చేశారు. అతను కూడా ఇక్కడ ప్రసంగించారు.