కరైకుడి టౌన్ లో ఉన్న ఆలయం కృష్ణమూర్తి పెరుమాళ్ కోవిల్. ఈ ఆలయం నగరం నడి బొడ్డులో ఉంది. శివ మరియు పెరుమాళ్ అనే ఇద్దరు దేవుళ్ళకి ఈ ఆలయం అంకితమివ్వబడింది. స్వామీ పెరుమాళ్ తిరుమల దైవంగా స్థానికులలో ప్రసిద్ది. విష్ణు మూర్తి రూపాలలో ఒకటి పేరుమాళ్ రూపం. హిందూ మైతాలజీ ప్రకారం, విష్ణు మూర్తి ఈ విశ్వం యొక్క మనుగడకు కారణం అవగా శివుడు ఈ విశ్వం యొక్క వినాసకారుడు. బ్రహ్మ దేవుడు ఈ సృష్టి కర్త.
స్థానిక నమ్మకాల ప్రకారం, ఈ ఇద్దరు దేవుళ్ళు తరచూ భులోకాన్ని సందర్శిస్తారు. ఆ సందర్శనలో ఈ ఆలయాన్ని వారి నివాసం గా మార్చుకున్నారు. ఆశ్చర్యకరంగా, ఈ దేవుళ్ళ యొక్క సహాధర్మచారినులైన పార్వతి మరియు లక్ష్మి దేవి విగ్రహాలు ఇక్కడ ఏర్పాటుచెయ్యబడలేదు.