గోలాఘాట్ జిల్లాలోని దిపోరలో కళ్యాణి మందిరం ఉంది. దిపోర, హాలెం రెవెన్యూ సర్కిల్ లోనిది. ఈ ఆలయం కళ్యాణి మాతకు చెందింది. అరిమట్ట రాజు చిన్నదైనప్పటికీ ఎంతో పవిత్రమైన ఈ ఆలయాన్ని శక్తి దేవత అవతారం, దుర్గామాత ఉదారమయ రూపమైన కళ్యాణి మాత గౌరవార్ధం కట్టించాడు.
ఈ ఆలయానికి సంబంధించి ఎటువంటి అసాధారణమైన వాస్తు శైలి ఏమి లేదు. ఇది వర్ణనకు వీలు లేని విధంగా చాల సాదారణంగా ఉంటుంది. ఈ ఆలయం ఒక సాధారణ అస్సాం నంఘర్ ను పోలి ఉంటుంది. అయినప్పటికీ, అనేక మంది భక్తులు తమ ధార్మిక విశ్వాసాల వలన ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
కళ్యాణి మందిరం, కాజీరంగా జాతీయ పార్కుకు ఎంతో దగ్గరగా ఉండటం వలన పర్యాటకులు ఈ ఆలయ సందర్శనకు ప్రాధాన్యతనిస్తారు. జాతీయ పార్కు లో మీరు బస చేసినప్పుడు కళ్యాణి మందిరాన్ని సందర్శించ దలచుకొంటే అదే రోజున గోలాఘాట్ జిల్లాలోని అనేక ఇతర ఆకర్షణలతో కూడిన ఒక ఉమ్మడి ప్రణాళికను మీరు తయారుచేయవచ్చు. అదృష్టవశాత్తు ఈ జిల్లాలో సందర్శనకు అనువైన అనేక ప్రాంతాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications