కొచ్చి కి ఒక వైపు న ఉండే బోల్ ఘట్టి ద్వీపం లో బోల్ ఘట్టి పాలస్ నెలకొని ఉంది. 1744 లో డచ్ వారు దీనిని రూపొందించారు. ఈ పాలస్ వారసత్వ సౌధాన్ని తలపిస్తుంది. పాలస్ నిర్మాణం తర్వాత చుట్టూ పెంచిన పచ్చని తోటలు మరియు లాన్ ఈ పాలస్ కి పరిపూర్ణత కలిగించాయి.
మొదట్లో, డచ్ మలాబర్ కమాండర్ ఈ పాలస్ లో ఉండేవారు. ఆ తర్వాత, 1909 లో డచ్ వ్యాపారులు ఈ పాలస్ ని బ్రిటిష్ వారికి అద్దెకి ఇచ్చారు. అప్పటినుండి, ఏంతో మంది బ్రిటిష్ గవర్నర్లు పాలస్ కిటికీల నుండి రమణీయ ప్రకృతి దృశ్యాలు, మృదువుగా ప్రవహించే అరేబియన్ సముద్ర అందాలు తిలకిస్తూ విలాసవంతంగా గడిపేవారు.
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రపు ఆస్తిగా ఈ పాలస్ ని ప్రకటించారు. విలాసవంతమైన హోటల్ మరియు రిసార్ట్ గా ఈ పాలస్ ప్రస్తుతం పర్యాటకులని ఆకర్షిస్తోంది. ప్రతి సంవత్సరం, వేల మంది పర్యాటకులు నిర్మలమైన ఈ పాలస్ ని మరియు పరిసర ప్రాంతాలని చూసి ఆనందించడానికి తరలి వస్తారు. ఆయుర్వేదిక్ మసాజు కేంద్రాలు, గోల్ఫ్ కోర్స్ లు మరియు స్విమ్మింగ్ పూల్ సౌలభ్యాలు ఈ పాలస్ లో కలవు.