పరదేశి సినాగోగ్యు అనగా యూదూల ప్రార్ధనాలయం.కామన్ వెల్త్ దేశాల్లో అతి పురాతనమైన ప్రార్ధనాలయంగా దీనిని చెప్పుకోనవచ్చును. అంతే కాదు క్రియాశీలంగా ఉన్న పురాతన యూదూల ప్రార్ధనాలయంగా కూడా చెప్పుకోనవచ్చును. 1568 లో మలబార్ ఎహుదాన్ చే నిర్మించబడిన ఈ ప్రార్ధనాలయం కాలం తో వచ్చిన మార్పులని కూడా తట్టుకుని నిలబడింది.
ఫోర్ట్ కొచ్చి లో ఒక భాగం అయిన జియు టౌన్ లో ఈ ప్రార్ధనాలయం ఉంది. పరదేశి సినాగోగ్యు లో ప్రసిద్ద లా స్క్రోల్స్ ఉన్నాయి. అంతే కాదు, బహుమతిగా లభించిన స్వర్ణ కిరీటాలు, ఇత్తడి తో చేసిన విశాలమైన స్టేజి, బెల్జియన్ గాజు షాన్డిలియర్ వంటి వాటిని మనం ఈ ప్రదేశంలో గమనించవచ్చు. జోసెఫ్ రబ్బన్ అర్హత ద్వారా సంపాదించిన తామ్ర పలకలను సందర్శకులు వీక్షించవచ్చు.
ఈ పలకల మీద రాయబడిన అక్షరాలు తమిళంలో ఉన్నాయి . ప్రాచీన నిర్మాణ వైభవానికి ఈ ప్రార్ధనాలయం ఒక గొప్ప ఉదాహరణ. ఇక్కడ నేల మీద పింగాణి పలకలపై చేతితో గీసిన చిత్రాలని గమనించవచ్చు. ప్రతి పలక ప్రత్యేకమైన హస్తకళల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. నేలపై పరవబడిన ప్రాచ్య దేశపు తివాచీని కూడా మనం గమనించవచ్చు. ఇథియోపియన్ ఆఖరి చక్రవర్తి నుండి అందుకున్న ఆఖరి కానుక ఈ తివాచీ.



Click it and Unblock the Notifications