కుందాపురకు 16 కి.మీ.ల దూరంలో మరణకట్టె కలదు. ఇది కొల్లూరు మార్గంలో కలదు. ఈ ప్రదేశంలో అనేక దేవాలయాలున్నాయి. పురాతనమైన బ్రహ్మలింగేశ్వర దేవాలయం కలదు. మాత మూకాంబిక మూకాసురుడిని వధించిన తర్వాత ఈ ప్రదేశంలో మారణ హోమం చేసిందని చెపుతారు.
ఈ దేవాలయం తూర్పు వైపుగా ఉంటుంది. అయితే, గర్భగుడి ఉత్తర దిశగా ఉంటుంది. వాత యక్షి, మలయాళి యక్షి, ఇరువురు ద్వారపాలకుల విగ్రహాలు దేవాలయంలో ఉంటాయి. ప్రధాన దేవతలుగా బ్రహ్మలింగేశ్వర, శ్రీ హైగులి మరియు హులి దేవరు, చిక్కమ్మ, పరివారం ఉంటారు.
మకర సంక్రాంతి, రధోత్సవాలు వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరుపుతారు. పర్యాటకులు దేవాలయాన్ని ఉదయం 6 గం. నుండి మ. 1 గం.వరకు మ. 3 గం నుండి రాత్రి 9 గంటలవరకు దర్శించవచ్చు.



Click it and Unblock the Notifications