ఆనంద పద్మనాభన్ తోప్పు మరియు పతిర తోప్పు గా ఈ పతిరమన్నాల్ ని పిలుస్తారు. ఇది కుమరకోమ్ కి దగ్గర లో ఉన్న ఒక అందమైన చిన్న ద్వీపం. ఈ సుందరమైన ప్రదేశం వేమ్బనంద్ సరస్సు లో 10 ఎకరాలలో వ్యాపించి ఉన్నది.కొట్టాయం మరియు అల్లెప్పి జిల్లాల సరిహద్దులలో ఉన్న ఈ ప్రదేసానికి ఫెర్రీ (పడవ) ద్వారా కుమరకోమ్ నుంచి చేరుకోవచ్చు.కుమరకోమ్ నుంచి ఈ ద్వీపానికి బ్యాక్ వాటర్స్ లో మైమరపించే ప్రయాణం అని చెపొచ్చు. ఈ ద్వీపంలో ప్రత్యేక ఋతువులలో వచ్చే 50 రకాల జాతుల వలస పక్షులు ఇంకా ఇక్కడే ఉండే 91 రకాల పక్షి జాతులు ఇక్కడ కనపడే పక్షులు గా నమోదయ్యాయి.ఈ పచ్చటి ద్వీపం తన సహజ సిద్దమైన అందం ఇంకా ప్రశాంత వాతావరణం, తెల్లటి ఇసుక తెన్నెల తో పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్దనటం లో అతిసయోక్తి లేదు. ఈ ప్రశాంత సుందర ప్రదేశం ప్రకృతి అద్బుతాలని చూసి తరించి విశ్ర మించాలనుకునే పర్యాటకులకు అతి ఉత్తమమైనది. ఫోటోగ్రఫీ అభిరుచి కల పర్యాటకులు ఈ చుట్టుతా నీరు ఉండే సుందర ప్రదేశాన్ని చాల ఇష్టపడతారు.