భారత దేశంలో డ్రిఫ్ట్ వుడ్స్ చే తయారు చేయబడిన ఎన్నో కళాఖండాల సేకరణ కలిగిన ఏకైక మ్యూజియం ఈ బే ఐలాండ్ డ్రిఫ్ట్ వుడ్ మ్యూజియం. ప్రకృతి యొక్క కళా నైపుణ్యం, మానవుడి సృజనాత్మకత కి సాక్ష్యం ఈ మ్యూజియంలో కనిపించే కళాఖండాలు. వీటి వల్ల ఈ మ్యుజియం ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందింది. వ్రేళ్ళ నుండి తయారు చేయబడిన శిల్పాలు ఈ మ్యూజియంలో నున్న ఆసక్తికరమైన అంశాలలో ఒకటి. ఈ మ్యూజియంలో ప్రదర్శించబడిన కళాఖండాలు సముద్రపు అలల ద్వారా సహజంగా సృష్టించబడినవి. వీటిని మ్యూజియం అధికారులు సేకరించి, సవరించి,మెరుగుపట్టారు. వైవిధ్యమైన మరియు అద్భుతమైన ఈ మ్యూజియం శ్రీమతి రాజి పున్నూస్ గారి ఆలోచన కి రూపకల్పం తన అసాధారణ కళాత్మక విలువలు మరియు ప్రత్యేకతల వల్ల రాష్ట్ర ప్రభుత్వం వారిచే 'ది మోస్ట్ ఇన్నోవేటివ్ టూరిజం ప్రాజెక్ట్ అవార్డ్(2004) ని ఈ మ్యూజియం కైవసం చేసుకుంది. 2001 లో ఈ మ్యూజియం ని ప్రారంభించారు. లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో కూడా ఈ మ్యుజియం చోటు దక్కించుకుంది. కళాత్మక హృదయం కలిగిన వారితో పాటు సాధారణ పర్యాటకుడిని కూడా ఈ మ్యూజియం సంతోషపరుస్తుంది. సమయం : ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు (వారం లో ని పని దినాలలో మాత్రమే)ఆదివారం : ఉదయం 11:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు సెలవు దినం : సోమవారం