షుమారు 4.1 హెక్టేర్ల విస్తీర్ణంలో విస్తరించిన మిర్జాన్ కోటను పర్యాటకులు తప్పక చూడాలి. ఇది అగ్నాశని నది ఒడ్డున కలదు. అందమైన శిల్ప కళా చాతుర్యం. రెండు గోడలుకల కోట ఇది. లాటరైట్ రాళ్ళతో అతి ఎత్తున నిర్మించారు. ఎత్తైన బురుజులు కలిగి ఉంటుంది. మిర్జాన్ ఫోర్ట్ ఒకప్పుడు అనేక యుద్ధాలను చూసిందని చెపుతారు. దీనిపై అనేక కధలున్నాయి. కోటకు ఒక ప్రధాన మరియు మూడు అదనపు ప్రవేశాలు కలవు. ఒకదానితో ఒకటి కలిసిన అనేక బావులు కూడా ఈ కోటలో ఉన్నాయి. వీటిలోని నీరు నిర్మాణం చుట్టూ కూడా ప్రవహిస్తుంది.
ఇతిహాసం మేరకు, 16వ శతాబ్దంలో గెర్ సొప్పకు చెందిన రాణి చెన్నభైరవదేవి ఈ కోటలో 54 సంవత్సరాలు నివసించిందని చెపుతారు. ప్రస్తుతానికి ఈ కోట శిధిలావస్ధలో ఉంది. దేశ పురావస్తు శాఖ అధీనంలో ఉన్న ఈ కోటలోని గత వైభవాలైన ప్రవేశ ద్వారం, దర్బార్ హాల్, రహస్య మార్గం మరియు మార్కెట్ ప్లేస్ లను పునర్నించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. సమీపంలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. దీని వద్ద హిందు దేవుళ్ళు, దేవతల రాతి విగ్రహాలుంటాయి. పురాతన కాలంనాటివి అంటే సుమారుగా 1652 నాటి బంగారు నాణేలు , సుమారు 50 ఇనుప తుపాకి గుండ్లు, సర్పమల్లిక వంశ నాణేలు, మట్టి కుండలు వంటివి ఎన్నో ఇక్కడ చూడవచ్చు.