సికందర్ బాగ్ ప్రధానంగా ఒక తోటను సూచిస్తుంది, అయితే, అది ఈ ప్రాంగణంలో ఒక విల్లా లా కూడా ఉంది. దీనిని చివరి అవధ నవాబు వాజిద్ అలీ షాహ్ నవాబు వేసవి విడిదిగా నిర్మించారు. ఈ తోటకు గొప్ప అలెగ్జాండర్ పెరుపెట్టారా లేదా అతనికి ఇష్టమైన భార్య సికందర్ మహల్ బేగం పేరు పెట్టారా అనేది స్పష్టత లేదు. వాజిద్ అలీ షాహ్ నవాబు రంగులతో కూడిన వ్యక్తిత్వం కలవాడు. అందువలన అతను తను ఇష్టపడే రాస-లీలలను, కథక్ నృత్యాలను చూడడానికి, సంగీతం, ముషాయిరాలు వినడానికి, ఇతర సాంస్కృతిక, కళాత్మక ప్రదర్శనల కోసం ఈ తోట మధ్యలో ఒక మంటపాన్ని నిర్మించాడు.
అయితే ఈ తోట 1857 లో భారత స్వతంత్ర మొదటి యుద్ధ సమయంలో బ్రిటీషు సైన్యానికి వ్యతిరేకంగా ఒక బలమైన పట్టుగా మార్చబడింది. ఇది లక్నోను ముట్టడించే సమయంలో 2200 మంది సైనికులకు ఆతిధ్యం ఇచ్చింది. బ్రిటీషు సైనికాధికారి సర్ కోలిన్ కాంప్ బెల్ నేతృత్వంలో బ్రిటీషు బలగాలచే అనేకమంది సైనికులు మరణించారు. గతం తర్వాత, సికందర్ బాగ్ ఇప్పుడు భారతదేశ నేషనల్ బొటనికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ కు నిలయంగా ఉంది.



Click it and Unblock the Notifications