1500 సీటింగ్ సామర్ధ్యం గల గురునానక్ స్టేడియం, (దాదాపు) 15.4 కోట్ల రూపాయలతో నిర్మించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా సమావేశాల వేదికగల ఈ ప్రదేశం అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాపించబడింది. ఇది భారతదేశం లో 2001లో జరిగిన జాతీయ క్రీడల ప్రారంభ, ముగింపుకు ఆతిథ్యమిచ్చింది. ఈ స్టేడియంలో జరిగిన కబడ్డీ వరల్డ్ కప్పుకు కత్రిన కైఫ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ‘లుధియానా ప్రైడ్’ అనే బాగా నిర్వహించబడే ఫుట్ బాల్ మైదానంలో జాతీయ ఫుట్ బాల్ లీగ్ (NFL) మాచ్ లు జరిగాయి. అత్యంత ఆధునిక సౌకర్యాలు కలిగిన ఈ ప్రాంగణంలో బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హ్యాండ్ బాల్, వాలీబాల్, బాట్మింటన్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్ వంటి అనేక ఆటలు నిర్వహించబడతాయి.