ఈ సముద్ర తీర టెంపుల్ ను క్రి.శ.700 నుండి 728 వరకూ నిర్మించారు. ఈ నిర్మాణం బంగాళాఖాత సముద్ర తీరాన్ని పర్యవేక్షిస్తూ వుంటుంది. గ్రానైట్ రాళ్ళతో నిర్మించబడిన ఈ టెంపుల్ మహాబలిపురంలోని స్మారకలాలలో ఒకటి. దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో సంస్థ గుర్తించింది. దేశపు దక్షిణ భాగం లో ఇది ఒక పురాతన దేవాలయంగా పేర్కొనబడింది. ఈ టెంపుల్ లో ఒక శివ లింగం మరియు విష్ణు మూర్తి విగ్రహం కూడా వుంటాయి. దుర్గ అమ్మవారు తన సింహ వాహనం పై కూర్చుని దర్శనమిస్తుంది. ఇక్కడ బహు దేవాతరాధన వుండటం విశేషం. వివిధ మతాలవారిని త్రుప్తి పరచినట్లు కనపడుతుంది. దీని నిర్మాణ సమయంలో కల పాలకుల పరమత సహనానికి ఉదాహరణగా కనపడుతుంది.



Click it and Unblock the Notifications