జలేశ్వర్ ఆలయం, మహేశ్వర్ వద్ద ఉన్న పరమశివుడికి అంకితమైన ఒక ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయంలోని దేవతకు 'నీటి యొక్క దేవుడు' గా పూజలు జరుపుతారు. జలేశ్వర్ ఆలయం, శివుడు స్వర్గం నుండి గంగా నది యొక్క ప్రవాహ ఒరవడి నుండి భూమిని రక్షించడానికి నిర్మించారు.
ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి చాలా కాలం నుండి పూజలు జరుపుతున్నాయి. పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించిన సమయం సద్వినియోగం అవుతుంది.
ఈ ఆలయ నిర్మాణకళ మహోన్నత స్తంభాలతో నిస్సందేహంగా ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ దేవాలయం పైన కనిపించే చెక్కడాలు చాలా మనోహరంగా ఉంటాయి. చెక్కిన వ్రేలాడే బాల్కనీలతో ఉన్న ఈ ఆలయం పూర్తిగా వేరే రూపును సంతరించుకున్నది. ప్రశాంత వాతావరణంలో భక్తులు ఈ ఆలయ ప్రాంగణంలో నీటి యొక్క దేవుడిగా ఇక్కడ శివుడికి పూజలు జరుపుతారు.