ముగ్ధుల్ని చేసే పుష్పావతి నది మీద అయిదు కిలోమీటర్ల నిడివితో నిర్మించిన పిమ్పల్గావ్ జాగా డాం మల్షేజ్ ఘాట్ లో వుంది.ఈ డ్యాం చుట్టుపక్కల ప్రాంతాల అందాలను అందించే అద్భుతమైన దృశ్యాల నేపధ్యంలో నెలకొని వుంది. జామ పోలంక, విస్లింగ్ త్రష్, కంజు పిట్ట, నీల బోలకోడి లాంటి చాలా పక్షులు ఇక్కడ కనపడతాయి. పక్షి ప్రేమికులు ఈ విహంగ కేంద్రం చూసి ఆనందిస్తారు. ఫ్లెమింగో లాంటి చాల వలస పక్షులు కూడా ఇక్కడ చూడవచ్చు.