హిమాచల్ ప్రదేశ్ లో ని మండి-పతంకోట్ హైవే లో నెలకొని ఉన్న త్రిలోకనాథ్ ఆలయం ఈ ప్రాంతం లో ఉన్న అతి ప్రాచీన ఆలయాలలో ఒకటి. అజ్బెర్ సేన్ రాణి అయిన సుల్తాన్ దేవి చేత 1520 లో ఈ ఆలయం నిర్మించబడింది. హిందూ దైవం, లయకారుడు అయిన శివుడికి ఈ ఆలయం అంకితమివ్వబడింది. ఆ ఆలయ గర్భ గుడి లో త్రి ముఖాలు కలిగిన శివుడు ఉన్నాడు. నారద, శారద మరియు ఇతర హిందూ దేవతలు మరియు దేవుళ్ళ శిల్పాలు ఈ ఆలయం లో గమనించవచ్చు.