ఇంగ్లాండ్ మహారాణి విక్తోరియాకి ఉర్దూ భాష అంటే చాలా ఇష్టం. ఆమె ఇంగ్లాండ్ లోని తన పాలెస్ లో ఉర్దూ, పెర్షియన్ భాషలు నేర్పించడానికి భారతదేశం నుండి మఝార్ అలీ మున్ష్ (టీచర్) ని పిలిచారు.
మున్షి గారి సేవలకు సంతోషించి, తృప్తిచెందిన రాణి ఆయన కోసం 1850వ సంవత్సరంలో మండవర్ లో మండవర్ మహల్ అని పిలువబడే ఒక పాలెస్ ని నిర్మించారు. ఈ పాలెస్ మరో ఆశక్తికరమైన మందిరం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని గల్ఖ దేవి ఆలయం అంటారు. ఈ మందిరం కుందన్పూర్ గ్రామ సమీపంలోని మండవర్ బ్లావాలి రహదారిపై ఉంది.
రుక్మిణీ దేవి పూజ కోసం ఈ ప్రదేశాన్ని సందర్శించినపుడు, ఆమె ప్రియుడైన శ్రీకృష్ణుడు ఆమెను ఎత్తుకువెళ్ళాడని నమ్మకం. పర్యాటకులు, యాత్రీకులు సందర్శించకుండా వెళ్ళడానికి వీలులేని ప్రదేశం ఈ గల్ఖ దేవి ఆలయ౦.