మైసూర్ సందర్శించే యాత్రికులు మైసూర్ కు షుమారు 20 కి.మీ. దూరంలో ఉన్న బృందావన గార్డెన్స్ తప్పక చూడాల్సిన ప్రదేశమే. దీనిని ఒకప్పుడు క్రిష్ణరాజేంద్ర టెర్రస్ గార్డెన్స్ అనేవారు. బృందావన గార్డెన్స్ క్రిష్ణరాజ సాగర్ డ్యామ్ క్రింది ప్రాంతంలో ఉంది. ఈ డ్యామ్ ను 1924 లో క్రిష్ణరాజ ఒడయార్ IV మహారాజు పేరుపై భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1924 నుండి 1932 సంవత్సరాల మధ్య నిర్మాణం చేశారు.