రైలు మ్యూజియం 1979 లో స్ధాపించారు. చాముండి గ్యాలరీ లో రైల్వేల పురోగతి సూచించే అంశాలుంటాయి. పర్యాటకులు శ్రీ రంగ మర్కీ లో రాజుల వాహనాలు చూడవచ్చు. ఇండియాలో తయారైన మొదటి స్టీమ్ ఇంజన్ కూడా చూడవచ్చు. మ్యూజియంలోని టాయ్ ట్రైన్ పిల్లలకు ఆసక్తి కలిగిస్తుంది. సోమవారం తప్ప వారంలోని ప్రతి రోజు ఉ.10 గం. నుండి 1 గం. వరకు మరియు మ.3 గం. నుండి సా. 5 గంవరకు దర్శించవచ్చు.