చాముండి హిల్స్, మైసూర్
చాముండి హిల్స్, మైసూర్ పట్టణాన్ని చూసేవారు తప్పక చూడవలసిన ప్రదేశంగా చెప్పాలి. ఈ కొండలు సముద్రమట్టానికి సుమారు 1065 మీటర్ల ఎత్తున ఉన్నాయి. చాముండి హిల్స్ పై భాగాన చాముండేశ్వరి దేవాలయం ఉంది. చాముండేశ్వరి పార్వతీ దేవి అవతారంగా చెపుతారు. ఒడయార్ మహారాజులు చాముండేశ్వరిని తమ దేవతగా కొలిచేవారు. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. తర్వాత 1827 సంవత్సరంలో మైసూర్ రాజులు దీనికి కొన్ని మరమ్మత్తులు నిర్వహించారు. దేవాలయం ముందరి భాగంలో మహిషాసుర రాక్షస రాజు విగ్రహం కూడా ఉంటుంది.