ఈ ఆలయం నీమచ్ కి తూర్పున 18 కి. మీ. దూరంలో ఉన్నది. మహామాయ భద్వమాత ఆలయం పాలరాయితో అందంగా నిర్మించారు. ఈ మాతా విగ్రహాన్ని తొమ్మిది నభదుర్గ విగ్రహాలు అవి బ్రాహ్మి, మహేశ్వరీ, కుమారి, వైష్ణవి, వారాహి, నర్సిన్హి , ఏఅన్ద్రి, శివ్దత్తి మరియు చాముండ చుట్టూరా ఉన్నాయి. భారతదేశం లో ముఖ్యమైన ఆలయాల్లో ఒకటిగా, శక్తిగా ఈ భద్వమాత ఆలయాన్ని వర్ణిస్తారు.
ఈ ఆలయాన్ని దర్శించిన తరువాత భక్తులు ఆధ్యాత్మికంగా బలంగా మరియు మానసికంగా శాంతిని పొందుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న బావ్ది పవిత్ర నీటిని ఆరోగ్య తీర్థ్ అని కూడా అంటారు. ఈ చెరువులో ఉన్న పవిత్రమైన నీతితో స్నానం చేస్తే, శారీరక రుగ్మతలన్నినయమవుతాయని అంటారు. పురానకతనం ప్రకారం, భద్వ మాత ఈ ఆలయంలో ఉంది, భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తుందని చెపుతారు. ఈ ఆలయంలో ప్రతి రోజు సాయంకాలం ఇచ్చే హారతులు చూసిన భక్తులు మానసిక ప్రశాంతతతో వెళతారు.