గాంధీ సాగర్ డాం, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నీమచ్ దగ్గర మంద్సూర్ జిలాలో ఉన్న ఒక పర్యాటక ఆకర్షణ. చంబల్ నది మీద ఉన్న ఈ ప్రముఖ ఆనకట్ట నిర్మించటానికి పునాది రాయిని అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రు వేశారు. భారతదేశంలోనే రెండవ పెద్దది అయిన జలాశయం కలిగి ఉన్నందువలన, ఇక్కడికి వేల సంఖ్యలో వలస పక్షులు వొస్తుంటాయి, అందువలన ఈ జలాశయాన్ని ఇంటర్నేషనల్ బర్డ్ లైఫ్ ఏజెన్సీ వారు ధృవీకరించారు.
ఈ డాం 204 అడుగుల ఎట్టు మరియు 514 అడుగుల పొడవు ఉన్నది. దీని కుడివైపు ఒడ్డు మీద ఒక అద్భుతమైన జల విద్యుత్ పవర్ స్టేషన్ ఉన్నది. ఈ ఆనకట్ట డిశ్చార్జెస్ సెకనుకు 21.238 క్యూబిక్ మీటర్లు చిందే విధానంలో విడుదల అవటంవలన, ఇది చాలా పెద్దది అని చెప్పటంలో సందేహం లేదు. పరిశోధన మరియు టూరిజం రెండు సందర్భాలలో, ఈ గాంధీ సాగర్ డాంకు అపారమైన ప్రాముఖ్యత సంతరించుకున్నది.