ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఈ ప్రదేశంలో కల వివిధ గురుకులాలను సందర్శిస్తారు. ఈ గురుకులం దేశంలోని మొట్టమొదటి ఆధునిక గురుకులంగా చెపుతారు. ఈ గురుకులం 1990 సంవత్సరంలో ప్రఖ్యాత ఒడిస్సి నృత్యకారిణి ప్రతిమా గౌరి బేడి కళలకు సాంస్కృతిక కార్యక్రమాలకు పుట్టినిల్లైన కర్నాటక రాష్ట్రంలో స్ధాపించారు. నృత్యగ్రామ్ ప్రకృతి ఒడిలో ఉంచబడిన ఒక సాంప్రదాయ నాట్య కారుల సమాజంగా చెప్పవచ్చు. ఒడిస్సి డ్యాన్స్ భంగిమలలో అత్యుత్తమ కృషి సలిపిన ప్రదేశంగా గుర్తించబడింది. నృత్యగ్రామ్ లో మట్టితో నిర్మించిన అనేక నివాసాలుంటాయి.
ఒక అందమైన దేవాలయం, ఒక యోగా కేంద్రం మరియు అనేక కాటేజీలు అతిధులకొరకు కలవు. ఇక్కడ కల ఒడిస్సి గురుకులం, మొహినిఅట్టం గురుకులం, కధక్ గురుకులం వంటివాటిని సందర్శించేందుకు పర్యాటకులు ఎక్కడెక్కడినుండో వస్తారు. ఈ రకమైన నాట్యాలే కాక, ఈ గురుకులాలలో భారతీయ సాంప్రదాయక నాట్యాలైన భరతనాట్యం, కూచిపూడి, కధాకళి, మణిపురి కూడా బోధిస్తారు. నాట్య తరగతులు వారానికి ఆరో రోజుల పాటు, ప్రతిరోజూ 8 గంటల సమయం నేర్పించబడతాయి. పురాతన ‘గురు-శిష్య’ సాంప్రదాయాలను ఇక్కడ ఆచరిస్తారు.



Click it and Unblock the Notifications