భారతదేశ తూర్పుతీరంలో అతిపెద్ద ఓడరేవులలో ఒకటైన పరదీప్ పోర్ట్, భారత ప్రభుత్వ అధీనంలో పరదీప్ పోర్ట్ ట్రస్ట్ చే నిర్వహించబడుతుంది. రాఘవేంద్ర చే స్థాపించబడిన ఈ పోర్ట్, ఒరిస్సాలో ప్రాధమిక నౌకాశ్రయంగా పరిగణించబడుతుంది. ఈ పోర్ట్ నుండి ధర్మల్ బొగ్గు, ఇనుము ప్రధాన వాణిజ్యంగా రావాణాచేయబడుతుంది. ఈ పోర్ట్ ప్రతిసంవత్సరం 55 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ సుకు రవాణా చేసే శక్తిని కలిగిఉంది.
పరదీప్ పోర్ట్, బంగాళాఖాతం, మహానది నది కలిసేచోట ఉన్న లోతైన నీటి నౌకాశ్రయం, మానవనిర్మిత మాడుగుల ద్వారా నౌకలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఒక ఆశక్తికరమైన గమనించదగ్గ విషయం ఏంటంటే, ఈ పోర్ట్ ఒక కృత్రిమ నౌకాశ్రయంపై నిర్మించబడింది అని. ఈ 14-బెర్త్ పోర్ట్, 43 అడుగుల కనీస డ్రాఫ్ట్ తో 70,000DWT వరకు నౌకలను కలిగిఉండే అద్భుతమైన సామర్ధ్యం కలిగిఉంది. పరదీప్ పోర్ట్ ప్రాంతంలో ఉక్కు ప్లాంట్, అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు, ఉష్ణ శక్తి ప్లాంట్ తో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా కూడా ఉండి, ఈ ప్రాంతంలో అభివృద్ది లక్ష్యంగా ఉంది.