ఈ ప్రాంతంలో అనేక సంవత్సారాల పాటు నడిచిన డచ్చి పాలనా వైభవానికి గుర్తుగా నిలుస్తుంది పురాతన డచ్చి చర్చి భవంతి. 17, 18 శతాబ్దాలలో డచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ప్రధాన కేంద్రంగా వుండడం వల్ల పులికాట్ డచ్చి సంస్కృతి ఆనవాళ్ళు కలిగి వుంటుంది. డచ్చి చర్చి, పక్కనే వున్న సమాధి ప్రాంగణం కేవల౦ చారిత్రిక ప్రాముఖ్యం వల్లనే కాక నిర్మాణ వైభవానికి కూడా ప్రసిద్ది పొందాయి.
చాలా సార్లు పునర్నిర్మించి నప్పటికీ ఈ చర్చి ఇప్పటికీ శిదిలావస్థలోనే వుంది. భారత పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో వున్న ఈ చర్చి లోని సమాధి ప్రాంగణంలో 400 ఏళ్ళ కన్నా పూర్వపు సమాధులు వున్నాయి. దీన్ని డచ్చి సార్వభౌమత్వం నడిచిన 1657 వ సంవత్సరంలో నిర్మించారని చెప్తారు. డచ్చి కాలం నాటి నిర్మాణ వైభవానికి తార్కాణాలుగా వున్న ఈ సమాధి ప్రాంగణం, చర్చి దేశం నలుచెరగుల నుండి పర్యాటకులను ఆకర్షిస్తాయి.