లక్ష్మణ్ జూలా అనేది నది, దేవాలయాలు మరియు ఆశ్రమముల అద్భుతమైన వీక్షణను అందించే 450 అడుగుల వేలాడే గొలుసు వంతెన. ఇది నిజానికి ఒక జనపనార వంతెనగా ఉండేది. తర్వాత 1939 వ సంవత్సరంలో గొలుసు ఐరన్ బ్రిడ్జ్ ను పునర్నిర్మించారు. హిందూ మత దేవుడైన రాముడు తమ్ముడు అయిన లక్ష్మణ్ ఒకప్పుడు గంగా నదిని దాటటానికి ఈ వంతెనను ఉపయోగించాడని నమ్ముతారు. అందువల్ల ఈ వంతెనను లక్ష్మణ్ జూలా అని పిలుస్తారు. ఈ వంతెన నుండి 2 కిమీ దూరంలో ప్రఖ్యాత స్వర్గ్ ఆశ్రమం ఉంది. దీనికి సమీపంలో 1980 లో నిర్మించబడిన రామ్ జూలా అనే ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది.ఇది లక్ష్మణ్ జూలా ప్రతిరూపంగా ఉంటుంది.